నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్

27 Jun, 2015 03:11 IST|Sakshi
నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్

చిట్యాల: వరంగల్ జిల్లా చిట్యాల మండలం కమల మెమోరియల్ హై స్కూల్‌లో శుక్రవారం ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారిని కర్రతో, చేతితో ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ విచక్షణ రహితంగా కొట్టింది. మండలంలోని నవాబుపేట శివారు చింతకుంటరామయ్యపల్లికి  ఏలేటి లత, తిరుపతిరెడ్డిల కూతురు శ్రీనీత(4)ను ఈ ఏడాదే నర్సరీలో చేర్పించారు. శుక్రవారం క్లాస్‌రూంలో ఏడుస్తు న్న శ్రీనీ తను స్కూల్ ఇన్‌చార్జి రాజేశ్ కర్ర, చేతితో వీపుపై కొట్టాడు. టీచర్‌పై రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు