'ఓటుకు కోట్లు కేసుపై ఈడీకి ఫిర్యాదు'

29 Jun, 2015 17:35 IST|Sakshi

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుపై హైకోర్టు న్యాయవాది జనార్దన్ గౌడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఇవ్వజూపిన 50 లక్షల లంచం ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు చేయాలని జనార్దన్ గౌడ్ ఈడీని కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి ఈ డబ్బు తీసుకువచ్చారో విచారణ చేయాలని జనార్దన్ గౌడ్ ఈడీని కోరారు.

మరిన్ని వార్తలు