పశుసంవర్ధక శాఖ సెక్షన్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు?

4 Apr, 2020 01:53 IST|Sakshi

మర్కజ్‌కు వెళ్లిన విషయాన్ని దాచి సచివాలయంలో విధులు

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన విషయాన్ని దాచి సచివాలయంలో విధులకు హాజరయ్యారన్న ఆరోపణలపై పశుసంవర్ధక శాఖ సెక్షన్‌ అధికారి ఆయూబ్‌ఖాన్‌ను సస్పెండ్‌ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఆ శాఖ ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం. త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఆయూబ్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా లేదని తేలింది. ప్రస్తుతం ఆయన నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. 

మరిన్ని వార్తలు