పురపాలకులకు పెంచిన వేతనాలు ఏప్రిల్ నుంచే..

25 Mar, 2015 01:14 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: నగర/పుర పాలక సంస్థల పాలకవర్గ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యుల గౌరవ వేతనాల పెంపు వచ్చేనెల(ఏప్రిల్) నుంచే అమల్లోకి రానుంది. ఈ మేరకు వేతనాలను పెంచుతూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలికల స్థాయి ఆధారంగా ఆయా పాలకవర్గాలకు కొత్త వేతనాలను ఈ ఉత్తర్వుల్లో ప్రకటించారు. కొత్త వేతనాలు ఇలా ఉన్నాయి.
 హోదా        గౌరవ వేతనం
 కేటగిరీ-1: మునిసిపల్ కార్పొరేషన్లు
 మేయర్                50,000
 డిప్యుటీ మేయర్            25,000
 కార్పొరేటర్            6,000
 కేటగిరీ-2: సెలక్షన్, స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీలు
 చైర్మన్            15,000
 వైస్ చైర్మన్        7,500
 వార్డు మెంబర్లు        3,500
 కేటగిరీ-3: ఇతర మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు
 చైర్మన్            12,000
 వైస్ చైర్మన్            5,000
 వార్డు మెంబర్లు    2,500
 

మరిన్ని వార్తలు