రోడ్డు ప్రమాదంలో తీవ్రంగ గాయపడిన హోంగార్డు చికిత్స పొందుతు కొద్దిసేపటి క్రితం మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా బోధన్లో సీడబ్ల్యూసీ గొడౌన్లో విధులు పూర్తిచేసుకొని ఇంటికి వెళ్తున్న సర్వర్(35) అనే హోంగార్డును వారం రోజుల కిందట ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.