హోంగార్డుల సర్వీసును క్రమబద్ధీకరిస్తాం

22 Sep, 2017 02:24 IST|Sakshi

► వారి సమస్యలపై సీఎం సానుకూలం: నాయిని

సాక్షి, హైదరాబాద్‌: హోంగార్డుల సమస్యల పరిష్కారం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సానుకూలంగా ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన సూచించారు.

బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవం త్‌రెడ్డి హోంగార్డులను రెచ్చగొడు తున్నారని, అలాంటి ప్రసంగాలు మానుకోవాలని సూచించారు. గురువారం సచివాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ హోంమంత్రిని కలిసి హోంగార్డుల సమస్యలను వివరించగా ఆయన పైవిధంగా స్పందించారు.

మరిన్ని వార్తలు