అగ్ని ప్రమాదంలో గృహిణి మృతి

4 Feb, 2016 10:42 IST|Sakshi

వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు అంటుకోవడంతో ఓ గృహిణి మృతిచెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉష(40) అనే గృహిణి ఇంట్లో వంట చే స్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు ఎగిసిపడటంతో అందులో చిక్కుకొని ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు