రేవంత్‌ రెడ్డికి టోకరా వేయబోయి..

5 Jun, 2017 17:45 IST|Sakshi
రేవంత్‌ రెడ్డికి టోకరా వేయబోయి..
హైదరాబాద్‌: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(కేవీఐసీ) పేరుతో తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాలాజీ అలియాస్‌ దేవర కుమార్‌ ప్రధానమంత్రి కృషి యోజనలో భాగంగా రూ. 2 కోట్లు ఇప్పిస్తానని  కొంతకాలంగా పలువురికి ఫోన్లు చేస్తున్నాడు.

ఇదే విధంగా మహబూబ్ నగర్ జడ్పీ సీఈవో, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరుతో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఫోన్ చేశాడు. ‘రేవంత్‌ సార్‌ నాకు తెలిసినవారి ద్వారా రూ. 2 కోట్లు ఇప్పిస్తా’అని ఆశ చూపాడు. మే 31వ తేదీలోగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని తెలిపాడు.

అనుమానం రావడంతో ఫోన్‌కాల్‌పై రేవంత్ పీఏ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు వలపన్ని సోమవారం కుమార్‌ను పట్టుకున్నారు. అతడు ఎవరెవరి నుంచి ఎంత డబ్బు వసూలు చేశాడో తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు