విద్యుత్ గ్రీవెన్స్‌కు భారీగా అర్జీలు

18 Jan, 2016 13:20 IST|Sakshi

నల్లగొండ జిల్లా మోత్కూరులో సోమవారం ట్రాన్స్‌కో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల సదస్సుకు భారీగా వినతులు వచ్చాయి. వినియోగదారులు తమ సమస్యల పరిష్కారానికి క్యూకట్టారు. మొదలైన రెండు గంటల్లోనే అధికారులకు 30 మంది వరకూ దరఖాస్తులు అందజేశారు. ఎస్సీ భిక్షపతి, గ్రీవెన్స్ సెల్ సీజీఎం హరగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు