‘యాదాద్రి’కి పోటెత్తిన భక్తులు

29 May, 2017 02:24 IST|Sakshi
‘యాదాద్రి’కి పోటెత్తిన భక్తులు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. క్యూలైన్లు, గర్భాలయం ఇలా.. ఎటు చూసినా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయం బయటి వరకు భక్తులు స్వామి దర్శనం కోసం బారులుదీరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు హైదరాబాద్‌ జంటనగరాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. సుమారు 50 వేల మంది వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. దైవ దర్శనానికి 6 గంటల సమయం పట్టిందని భక్తులు పేర్కొన్నారు. రద్దీ ఒక్కసారిగా పెరగడంతో దేవస్థానం అధికారులు సౌకర్యాలను సమకూర్చలేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.
మరిన్ని వార్తలు