చైతన్యపురిలో ఓ ఇంట్లో భారీ చోరీ

24 Jun, 2015 22:52 IST|Sakshi

హైదరాబాద్: ఓ బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో బుధవారం భారీ చోరీ జరిగింది. నగరంలోని చైతన్యపురి అల్కాపురిలో బ్యాంక్ ఉద్యోగిని రాజేశ్వరి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 33 తులాల బంగారం, 10 లక్షల నగదును దొంగలు అపహరించినట్టు సమాచారం.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు