కారులు.. బారులు

13 Jan, 2020 05:07 IST|Sakshi

సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న వారితో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాల రద్దీ కొనసాగింది. ఇక్కడ 16 కౌం టర్లకు గాను విజయవాడ వైపు 5 ఫాస్టాగ్‌కు, 4 నగదు చెల్లింపులకు కేటాయించారు. హైదరాబాద్‌ మార్గంలో 4 ఫాస్టాగ్‌కు, నగదు చెల్లింపునకు 3 మార్గాలు కేటాయించారు. ఫాస్టాగ్‌ లేని వాహనాలు కూడా ఆయా మార్గాల్లోకి వెళ్లడంతో మరింత ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. – చౌటుప్పల్‌/బీబీనగర్‌/కేతేపల్లి

మరిన్ని వార్తలు