భార్యను హతమార్చిన భర్త?

19 Sep, 2015 11:19 IST|Sakshi

రంగారెడ్డి జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా పుడూరు మండలంలోని ఎన్‌కేపల్లి గ్రామానికి చెందిన చెంచుపల్లిలో కుక్కుల అంజమ్మ(30) శనివారం  అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త లక్ష్మయ్యే ఆమెను చంపి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మయ్యకు ఇది నాలుగో వివాహం అనీ.. నలుగురు భార్యలు అనుమానాస్పద స్ధితిలోనే మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

మరిన్ని వార్తలు