అనుమానంతో భార్యను చంపిన భర్త

29 Apr, 2015 15:48 IST|Sakshi
మల్లేశం-మమత (ఫైల్ ఫోటో)

కరీంనగర్(గొల్లపల్లి): గొల్లపల్లి మండలం గోవిందునిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఓ భర్త, భార్యను పాశవికంగా హతమార్చాడు. వివరాలు.. మమత(26), మల్లేశం భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. కొన్ని రోజులుగా మల్లేశం తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

అనంతరం పరారయ్యాడు. అనుమానం పెంచుకుని, అదనపు కట్నం కోసం తరచూ వేధింపులకు గురిచేసేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు