మెడికల్‌ టూరిజం కేంద్రంగా హైదరాబాద్‌ 

19 Sep, 2019 02:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ స్థాయిలో మెడికల్‌ టూరిజానికి కేంద్రంగా హైదరాబాద్‌ పేరొందిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్య మని ఉద్ఘాటించారు. బుధవారం మారియెట్‌ హోటల్‌లో ఇండో–చైనా హెల్త్‌ కేర్‌ సమ్మిట్‌– 2019ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన వైద్యం చౌకగా హైదరాబాద్‌లో లభిస్తుందన్నారు. టీఎస్‌ డయాలసిస్, టీఎస్‌ డయాగ్నస్టిక్స్‌ పేరుతో ఉచిత సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు