నిశీధి వేళలో.. నిశ్శబ్ద నగరి

8 Dec, 2019 07:43 IST|Sakshi
శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు నిర్మానుష్యంగా ఎన్టీఆర్‌ గార్డెన్‌ రోడ్డు

శుక్రవారం అర్ధరాత్రి రోడ్లపై కనిపించని మహిళల కదలికలు

‘దిశ’ ఉదంతంతో నెక్లెస్‌రోడ్డులో రాకపోకల నిలిపివేత

మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగుల సందడి

పలుచోట్ల పోలీసు భద్రత.. భారంగా గడిచిన రాత్రి

సాక్షి, హైదరాబాద్‌: జన జీవనం ఉలిక్కపడ్డ రోజు రాత్రి చీకటి ఘనీభవించింది. రహదారులపై లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నా క్రీనీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. మృగాళ్ల మరణవార్త తెల్లవారు జామునే నలు‘దిశ’లా పాకడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరం ఊరేగింపయింది. పగలంతా సందడిగా ఉన్నా.. అర్ధరాత్రి వేళ మాత్రం ఏ రోడ్డులోనూ ‘భరోసా’ కనిపించలేదు. ‘దిశ’ ఉదంతం ఇంకా వణికిస్తూనే ఉంది.. రాత్రితో పాటే భయం కూడా పాకుతూనే ఉంది. ‘దిశ’ హంతకులను అంతమొందించిన శుక్రవారం రాత్రి నగరం ఎలా ఉంది? ప్రత్యేకించి రాత్రి 11.30 నుంచి తెల్లవారు జాము 2 గంటల వరకు జనజీవనం ఏ విధంగా ఉందో? తెలుసుకునేందుకు ‘సాక్షి’ నగరంలోని పలు ప్రాంతాల్లో ‘నైట్‌ విజిట్‌’ నిర్వహించింది.

అక్కడక్కడా ఆగిన పోలీసు వాహనాలు, ఫుడ్‌స్ట్రీట్స్‌లో యువకుల సందడి కనిపించింది. రాత్రి 11 గంటల సమయంలో నిబ్బరంగా, నిశ్చింతగా రాకపోకలు సాగించే మహిళల జాడ మాత్రం కనిపించలేదు. ఓ సంఘటన తర్వాత భాగ్యనగర వీధుల్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రధాన రహదారిని గతంలో మహిళా పారిశుధ్య కార్మికులు ఎవరికి వారు వేర్వేరుగా శుభ్రం చేసేవారు. కానీ శుక్రవారం అర్ధరాత్రి 12.05కు మాత్రం ముగ్గురు, నలుగురు కలిసి జట్టుగా ఒకేచోట రోడ్డు ఊడ్చే పనిలో ఉన్నారు. వారిని పలకరిస్తే.. ‘ఒంటరిగా ఉంటే పోకిరీలు వేధిస్తారు’ అంటూ గత సంఘటనలను గుర్తు చేశారు. ‘దిశ’ ఉదంతం తర్వాత పరిస్థితి మరింత భయానకంగా ఉందంటూ బసవమ్మ, శ్రీలక్ష్మి, లత, పద్మ అనే కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.

నగరం నిద్ర పోతున్న వేళ.. ఆ విశేషాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి..

⇒ గచ్చిబౌలి  ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ 1.50
శంషాబాద్‌ వైపు నుంచే వాహనాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ కూడలి నుంచి భారీ వాహనాలు, టిప్పర్లు, వాటర్‌ ట్యాంకర్ల రాకపోకలతో బిజీగా ఉంది. రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీలో తెల్లవారు జామున 2 గంటలకు బండరాళ్ల టిప్పర్ల రాకపోకలతో బిజీగా ఉంది. ఐదు నిమిషాల వ్యవధిలోనే 20 టిప్పర్లు బండరాళ్ల లోడ్‌తో వెళ్లాయి. టిప్పర్లతో పాటు లారీలు, వాటర్‌ ట్యాంకర్ల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి.

⇒ అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ 12.05
మెట్రోస్టేషన్‌ ప్రధాన రహదారిని పారిశుధ్య మహిళా కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు కలిసి ఒక టీమ్‌గా ఊడుస్తున్నారు. ఒంటరిగా ఉంటే పోకిరీలు వేధిస్తారని ఆందోళన  వ్యక్తం చేశారు. ‘దిశ’ ఉదంతం తరువాత పరిస్థితి మరింత భయానకంగా ఉందంటూ బసవమ్మ, శ్రీలక్ష్మి, లత, పద్మలు వాపోయారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై  హర్షం వ్యక్తం చేశారు.

అమీర్‌పేట చౌరస్తాలో రోడ్డు ఊడుస్తున్న పారిశుధ్య మహిళా కార్మికులు 

⇒ నెక్లెస్‌రోడ్డు..1.10
నెక్లెస్‌రోడ్డులోకి అప్పటికే ప్రవేశాన్ని నిలిపివేశారు. అంతకముందే ఐ లవ్‌ హైదరాబాద్, జలవిహార్‌ తదితర చోట్ల బర్త్‌ డే కేక్‌ కటింగ్‌ కోసం చాలామంది నెక్లెస్‌ రోడ్డులోకి వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఆ సమయంలో అటువైపుగా వచ్చే వాహనాలను సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ సైదులు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అయితే కొంతమంది డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలను నడపడాన్ని పోలీసులు గుర్తించారు.

నెక్లెస్‌రోడ్డులో యువకులను ప్రశ్నిస్తున్న పోలీసులు

⇒ మూసాపేట వై జంక్షన్‌..  11.30
ఇంకా వాహనాల రద్దీ తగ్గలేదు. అటు కూకట్‌పల్లి వైపు నుంచి ఇటు బాలానగర్‌ నుంచి వాహనాలు దూసుకొస్తూనే ఉన్నాయి. మూసాపేట మెట్రోస్టేషన్‌ సమీపంలో రహదారి చిమ్మచీకటిగా ఉంది.

అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ కింద పార్కు చేసిన ఆటోలు 

⇒ ఎస్‌ఆర్‌నగర్‌ బస్టాపు వద్ద 11.45
ట్రావెల్స్‌ బస్సుల కోసం భారీ సంఖ్యలో ప్రయాణికులు వేచి చూస్తున్నారు. తాము వెళ్లాల్సిన బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. 

డీఎల్‌ఎఫ్‌ మొదటి, రెండవ గేట్‌ ముందు ఫుడ్‌ స్టాళ్ల వద్ద ఐటీ ఉద్యోగులు  

⇒ మాదాపూర్‌ విఠల్‌రావునగర్‌ 12.00
కరాచీ బేకరీ నుంచి రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌ వరకు సర్వీస్‌ రోడ్డులో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారులు బిజీబిజీగా ఉన్నారు. వందలాది మంది ఐటీ ఉద్యోగులు అన్ని రకాల టిపిన్స్, కబాబ్స్, ఐస్‌క్రీమ్, చాట్‌ రుచి చూస్తున్నారు. రాత్రి ఒంటి గంట వరకు వేడి వేడి వంటకాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వీరంతా దిశ ఎన్‌కౌంటర్‌పై చర్చించుకుంటూ కనిపించారు. చాలామంది ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తూ మాట్లాడుకున్నారు.

మాదాపూర్‌– ఎంసీహెచ్‌ఆర్‌డీ జంక్షన్‌లో టిఫిన్‌ సెంటర్‌ వద్ద జనం  

⇒ పంజగుట్ట చౌరస్తా .. 12.37
ఎస్‌ఆర్‌ టైర్స్‌లో 24 గంటల పాటు పంక్చర్‌ సేవలు అందిస్తున్నారు. రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో పంక్చర్‌ పడినా తన వద్దకు వస్తే పంక్చర్‌ వేసేందుకు వెళ్తానని అస్లాం చెప్పుకొచ్చాడు. షిప్టుల వారీగా పగలు ఒకరు, రాత్రి మరొకరు ఇక్కడ పంక్చర్‌ సేవలు అందిస్తున్నారు.

⇒ ట్యాంక్‌బండ్‌1.40
లేక్‌ పోలీసులు పహారా కాస్తున్నారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు హుస్సేన్‌సాగర్‌ తీరానికి వచ్చేవారిని కాపాడడం వాళ్ల ప్రధాన విధి. ఫజల్‌ అహ్మద్‌ఖాన్, మహబూబ్‌ బాషా, పవన్‌కుమార్‌ ట్యాంక్‌పై విధులు నిర్వర్తిస్తూ కనిపించారు.

హుస్సేన్‌సాగర్‌ తీరాన బర్త్‌ డే వేడుక

⇒ రాంగోపాల్‌పేట..1.55
క్లాక్‌ టవర్‌ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్యాట్నీ సెంటర్‌ ప్యాట్నీ సెంటర్‌ కొందరు కార్మికులు సీసీ కెమెరాల  కోసం స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.

రాంగోపాల్‌పేట్‌ పాత పోలీస్‌స్టేషన్‌ రోడ్డులో తాజ్‌ హోమ్‌ హోటల్‌ వద్ద నిద్రిస్తున్న యాచకులు 

⇒ ప్యారడైజ్‌ చౌరస్తా 1.50
ఒక రెస్టారెంట్‌ ముందు టీ స్టాల్‌ తెరిచే ఉంది. చాలా మంది అక్కడ టీ తాగుతున్నారు.

నగరంలో ఇలా..

  • రాత్రి 11గంటల నుంచి 2.30 గంటల వరకు చింతల్‌కుంట నుంచి ప్రారంభమైన ‘సాక్షి’ విజిట్‌ ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కోఠి, అబిడ్స్‌ వరకు సాగింది. 
  • రాత్రివేళలో పోలీస్‌ పెట్రోలింగ్‌ను పెంచారు. ప్రధాన చౌరస్తాలో మొబైల్‌ పెట్రోలింగ్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 
  • నల్లగొండ చౌరస్తాలో పోలీస్‌పెట్రోలింగ్‌ పాయిధ దళాలను తలపించే విధంగా అయుధాలు ధరించి పోలీసులు బందోబస్తుతో నిఘా పెట్టారు.  
  • ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లే వారు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు.  
  • అర్దరాత్రి 12 గంటల సమయంలో  రద్దీగా ఉండే  పాతబస్తీలోని ప్రధాన రోడ్లతో పాటు ఆఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, కంట్రోల్‌ రూం, లక్డీకాపూల్, మాసాబ్‌టాంక్, బంజారాహిల్స్‌ రోడ్డు నెం.1 ప్రధాన రూట్‌లో జన సంచారం తగ్గింది.  
  • చార్మినార్‌–మక్కా మసీదు వద్ద అర్దరాత్రి దాటిన అనంతరం కూడా ప్రజల హడావుడి కనిపించేది. డిసెంబర్‌ 6 తో పాటు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపధ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.  
  • 12 గంటలు దాటిన తర్వాత నలువైపుల నుంచి చార్మి నార్‌ కట్టడం వరకు ఎవరిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.  
  • జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బంది చార్మినార్‌ – మక్కా మసీదు గ్రానైట్‌ రోడ్లను శుభ్రం చేశారు. 
  • 12.10 గంటల సమయంలో  చాంద్రాయణగుట్ట చౌరస్తా నుంచి మహిళలు గౌస్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, ఆరాంఘర్‌లకు వెళ్లేందుకు ఆటోల కోసం ఎదురు చూస్తూ కనిపించారు.  
  • షంషీర్‌గంజ్, శాలిబండ రోడ్లలో మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనాలపై ఇళ్లకు వెళ్లడం కనిపించింది.  
  • చార్మినార్‌ వద్ద రాత్రి 12.15 గంటలు: ఉప్పుగూడకు చెందిన పద్మావతి అనే మహిళ తమ కుమారులతో కలిసి నడుచుకుంటూ వెళ్లింది. అర్దరాత్రి రోడ్డుపై వెళుతున్న ఆమెను పలకరించగా... మాకెం కాదు.. భయమెందుకు అంటూ ధీమాగా బదులిచ్చింది.   
  • చార్మినార్‌ వద్ద 12.30:  జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బంది గ్రానైట్‌ రోడ్లను శుభ్రం చేస్తూ కనిపించారు.  
  • తెల్లవారు జామున 1.15 గంటలకు అఫ్జల్‌గంజ్‌ కూడలి జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపించింది.  
  • 1.55 గంటలకు కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా అసెంబ్లీ రోడ్డుపై జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులు గుంపులుగా వీధులను శుభ్రం చేస్తూ కనిపించారు.  
  • 2.15 గంటలకు బంజారాహిల్స్‌ రోడ్డు నెం.1లో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బంది వీధుల్ని శుభ్రం చేస్తూకనిపించారు. 
  • రాత్రి 11గంటల నుంచి 2.30 గంటల వరకు చింతల్‌కుంట నుంచి ప్రారంభమైన ‘సాక్షి’ విజిట్‌ ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కోఠి, అబిడ్స్‌ వరకు సాగింది. 
  • uరాత్రివేళలో పోలీస్‌ పెట్రోలింగ్‌ను పెంచారు. ప్రధాన చౌరస్తాలో మొబైల్‌ పెట్రోలింగ్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 
  • నల్లగొండ చౌరస్తాలో పోలీస్‌పెట్రోలింగ్‌ పాయిధ దళాలను తలపించే విధంగా అయుధాలు ధరించి పోలీసులు బందోబస్తుతో నిఘా పెట్టారు.  
  • ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లే వారు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు.  
  • అర్దరాత్రి 12 గంటల సమయంలో  రద్దీగా ఉండే  పాతబస్తీలోని ప్రధాన రోడ్లతో పాటు ఆఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, కంట్రోల్‌ రూం, లక్డీకాపూల్, మాసాబ్‌టాంక్, బంజారాహిల్స్‌ రోడ్డు నెం.1 ప్రధాన రూట్‌లో జన సంచారం తగ్గింది.  
  • చార్మినార్‌–మక్కా మసీదు వద్ద అర్దరాత్రి దాటిన అనంతరం కూడా ప్రజల హడావుడి కనిపించేది. డిసెంబర్‌ 6 తో పాటు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపధ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.  
  • 12 గంటలు దాటిన తర్వాత నలువైపుల నుంచి చార్మి నార్‌ కట్టడం వరకు ఎవరిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.  
  • జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బంది చార్మినార్‌ – మక్కా మసీదు గ్రానైట్‌ రోడ్లను శుభ్రం చేశారు. 
  • 12.10 గంటల సమయంలో  చాంద్రాయణగుట్ట చౌరస్తా నుంచి మహిళలు గౌస్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, ఆరాంఘర్‌లకు వెళ్లేందుకు ఆటోల కోసం ఎదురు చూస్తూ కనిపించారు.  
  • షంషీర్‌గంజ్, శాలిబండ రోడ్లలో మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనాలపై ఇళ్లకు వెళ్లడం కనిపించింది.  
  • చార్మినార్‌ వద్ద రాత్రి 12.15 గంటలు: ఉప్పుగూడకు చెందిన పద్మావతి అనే మహిళ తమ కుమారులతో కలిసి నడుచుకుంటూ వెళ్లింది. అర్దరాత్రి రోడ్డుపై వెళుతున్న ఆమెను పలకరించగా... మాకెం కాదు.. భయమెందుకు అంటూ ధీమాగా బదులిచ్చింది.   
  • చార్మినార్‌ వద్ద 12.30:  జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బంది గ్రానైట్‌ రోడ్లను శుభ్రం చేస్తూ కనిపించారు.  
  • తెల్లవారు జామున 1.15 గంటలకు అఫ్జల్‌గంజ్‌ కూడలి జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపించింది.  
  • 1.55 గంటలకు కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా అసెంబ్లీ రోడ్డుపై జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులు గుంపులుగా వీధులను శుభ్రం చేస్తూ కనిపించారు.  
  • 2.15 గంటలకు బంజారాహిల్స్‌ రోడ్డు నెం.1లో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బంది వీధుల్ని శుభ్రం చేస్తూ కనిపించారు.  
మరిన్ని వార్తలు