వైన్స్‌ షాపుల వద్ద ప్రత్యేక మార్క్‌లు 

6 May, 2020 14:24 IST|Sakshi

మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని పరిశీలించిన సీపీ అంజనీ కుమార్

సాక్షి, హైదరాబాద్‌ : వైన్స్‌ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని పలు మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని పరిశీలించారు. నారాయణగూడ శాంతి థియేటర్‌ దగ్గర ఉన్న ఓ మద్యం దుకాణాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు హైదరాబాద్‌లో 178 మద్యం షాపులు తెరిచారని చెప్పారు.

ప్రతి వైన్స్‌ షాపు వద్ద భౌతిక దూరం పాటించలే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించండం కోసం ప్రత్యే క మార్క్‌లు వేయించామని తెలిపారు. కంటైన్మెంట్‌ ప్రాంతాలలో పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. భౌతిక దూరంతోనే కరోనాను నివారించవచ్చని, దీనికి ప్రజలు సహకరించాలని అంజనీ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు