టిఫిన్‌ ఫ్రం మేయర్‌ హోమ్‌

11 Apr, 2020 07:39 IST|Sakshi
పూరీలు చేస్తున్న మేయర్‌ సతీమణి బొంతు శ్రీదేవి..

బంజారాహిల్స్‌: నగరంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా పోలీసులు ఇళ్లకు వెళ్లకుండా విధులకే పరిమితమవుతున్నారు. వీరికి తినడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని బంజారాహిల్స్‌రోడ్‌ నెంబర్‌–3లో నివసించే గ్రేటర్‌మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్‌ ప్రతిరోజూ తమ ఇంటి ఎదురుగా ఉన్న బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అధికారులు, సిబ్బందికి అల్పాహారంతో పాటు ఉదయం, సాయంత్రం టీ అందజేస్తున్నారు.  రోజుకొక వెరైటీతో టిఫిన్లు తయారు చేస్తూ పంపిస్తున్నారు.  గుజరాతీ సేవామండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కార్యక్రమంలో మేయర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు