ఆప్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా లుబ్నాసర్వత్

10 Apr, 2014 04:23 IST|Sakshi
ఆప్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా లుబ్నాసర్వత్

సాక్షి,సిటీబ్యూరో: ఆమ్‌ఆద్మీ పార్టీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా డాక్టర్ లుబ్నాసర్వత్(్ర49) బుధవారం నామినేషన్ దాఖలు ఏశారు. మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌కు చెందిన లుబ్నా ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇండోనేషియాలోని జకర్తాలో ఓ వర్సిటీలో ఎకనామిక్స్ విజిటింగ్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు, అవినీతికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీలో సభ్యురాలిగా చేరి, ఆ పార్టీ తరపున హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు