‘విలీన ఉత్సవాలను’ నిర్వహించాలి

5 Aug, 2014 01:26 IST|Sakshi
‘విలీన ఉత్సవాలను’ నిర్వహించాలి

 హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ స్టేట్ విలీనమైన సెప్టెంబర్ 17ను స్వాతంత్య్రదినంగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వమే అధికారిక ఉత్సవాలు నిర్వహించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ కు సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్యే ఆర్. రవీంద్రకుమార్ వినతిపత్రాన్ని సమర్పించారు. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని, ఇప్పుడు దానిపై ఆలోచించలేమని సీఎం అన్నారని తెలిసింది. ఈ ఉత్సవాలపై ఎంఐఎం ఒత్తిడి గత ప్రభుత్వాలపై పనిచేసిందని, ఈ ప్రభుత్వంపై కూడా ఉంటుందా అనేది సీఎం స్పందనను బట్టి తెలుస్తుందని చాడ వెంకటరెడ్డి మీడియాతో అన్నారు.
 

మరిన్ని వార్తలు