హైదరాబాదీ విద్యార్థుల ప్రపంచ రికార్డు 

16 Apr, 2018 02:10 IST|Sakshi

11 నెలల్లోనే ఖురాన్‌ కంఠస్థం 

సాక్షి, హైదరాబాద్‌: అతి తక్కువ వ్యవధిలో ఖురాన్‌ గ్రంథాన్ని కంఠస్థం చేసి హైదరాబాదీ చిన్నారులు ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆదివారం ఆసిఫ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఎంఎస్‌ హిఫ్జ్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఖురాన్‌లోని వ్యాఖ్యలను విద్యార్థులు పఠించారు. గతంలో ఈ రికార్డు ఈజిప్టు పేరిట ఉంది. నగరంలోని 28 మంది విద్యార్థులు 11 నెలల్లోనే మొత్తం ఖురాన్‌ గ్రంథాన్ని కంఠస్థం చేసి రికార్డు సాధించినట్లు అకాడమీ చైర్మన్‌ మహ్మద్‌ లతీఫ్‌ ఖాన్‌ చెప్పారు. కార్యక్రమంలో పలువురు మతగురువులు పాల్గొన్నారు. 
 
 

మరిన్ని వార్తలు