పాలమూరుకు వరం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

14 Nov, 2019 15:24 IST|Sakshi
ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, మహబూబ్‌నగర్‌ : వెనుకబడిన, వలసల జిల్లా పాలమూరుకు తెలంగాణలో మొదటి మెడికల్‌ కళాశాల రావడం మనకు ఒక వరమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. గురువారం స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అంతుబట్టని రోగాలు పెరుగుతున్న ఈ సమయంలో డాక్టర్లు నిత్య విద్యార్థిగా పరిశోధనలు చేయాలని సూచించారు. పేదరికంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అలాగే, మెడికల​ కళాశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి  చేసి సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు