అర్థరాత్రి కేసీఆర్ ను కలవలేదు: ఎర్రబెల్లి

23 Sep, 2014 12:04 IST|Sakshi
అర్థరాత్రి కేసీఆర్ ను కలవలేదు: ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ను తాను కలిశానని, కాని అర్థరాత్రి కాదని ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం 15 మంది ప్రముఖులతో పాటు కేసీఆర్ ను కలిసినట్టు చెప్పారు. తనకు పార్టీ మారే ఉద్దేశంలేదని, టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.

ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం మంచిది కాదని, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తమ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కేసీఆర్ ను ఎర్రబెల్లి దయాకరరావు కలిశారని వార్తలు రావడంతో ఆయన వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు