సాక్షి, సిటీబ్యూరో : ఐఐటీ-జేఈఈ పరీక్షా ఫలితాల్లో నగర విద్యార్థులు సత్తా చాటారు. నగరంలోని నారాయణ శ్రీచైతన్య ఐఐటీ అకాడమీలో చదివిన నలుగురు విద్యార్థులకు ఒకేరకంగా మార్కులు వచ్చాయి. 345/360 మార్కులు సాధించిన పూసా నిహాల్, కె.వి.వెంకట సతీష్, జి.కృష్ణచైతన్య, కె.జయచంద్ర.. ఆలిండియాలో ర్యాంకుల్లో మూడో స్థానంలో నిలిచారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను నారాయణ శ్రీచైతన్య అకాడమీ చైర్మన్ బీఎస్ రావు, డెరైక్టర్లు సింధు, సుష్మ తదితరులు అభినందించారు.