అక్రమ కట్టడాల కూల్చివేత

25 Aug, 2015 15:03 IST|Sakshi

సుల్తానాబాద్ (కరీంనగర్) : రోడ్డు పక్కన ఉన్న స్థలాలను ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు నిర్మించుకున్న వారిపై అధికారులు కొరడా ఝళిపించారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రత్న కాలనీలో రోడ్డు పక్కన ఉన్న స్థలాలను ఆక్రమించుకొని కట్టుకున్న ఇళ్లను ఎంపీడీవో వినోద్ ఆధ్వర్యంలో మంగళవారం తొలగించారు.
 

మరిన్ని వార్తలు