అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

17 Dec, 2015 12:01 IST|Sakshi

కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి బస్సులో తరలిస్తున్న 45 కేజీల గంజాయిని గురువారం ఉదయం పాల్వంచలో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు