ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఐటీ దాడులు 

12 Feb, 2020 08:16 IST|Sakshi

సాక్షి, కైలాస్‌నగర్‌(ఆదిలాబాద్‌): జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులపై మంగళవారం ఆదాయపన్నుల శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఆ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సంజయ్‌ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. సినిమారోడ్డులోని శ్రీరామ నర్సింగ్‌హోమ్, బస్టాండ్‌ ఎదుట గల శారద నర్సింగ్‌ హోమ్‌లపై దాడులు నిర్వహించారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లలో గల పలు ప్రైవేట్‌ ఆస్పత్రులపై దాడులు నిర్వహించి రికార్డులు పరిశీలించారు.   

మరిన్ని వార్తలు