చిరుధాన్యాల సాగు పెరగాలి

1 Dec, 2019 06:05 IST|Sakshi

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు పెరగాల్సిన అవసరం ఉందని, చిరుధాన్యాలు ఆహారంలో భాగం కావాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. చిరుధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీ లో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో పాటు రసాయనాలు వాడని ఆహారపు పంటలు వంటి వాటిపై దృష్టి సారిం చాలని పిలుపునిచ్చారు.  అనంతరం చిరుధాన్యాల స్టాళ్లను మంత్రి సందర్శించారు. 

మరిన్ని వార్తలు