వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం

16 Aug, 2018 15:36 IST|Sakshi
జెండాను ఎగురవేస్తున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కల్యాణ్‌రాజ్‌ 

జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్‌ జెండాను ఎగుర వేసిన అనంతరం, స్వీట్లను పంపిణీ చేశారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రొడ్డ కృష్ణ, నోముల జయపాల్‌రెడ్డి, కంతి చిరంజీవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మానెగల్ల మంజుల, మడంల మహిళా అధ్యక్షురాలు చెప్పాల వసంత, పట్టణ అధ్యక్షుడు చినపాగ వెంకటరత్నం, పట్టణ కార్యదర్శి కల్లెపు లక్ష్మి, నాయకులు మధు, శ్రీనివాస్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు