లక్నవరానికి ఇండియన్‌ హాస్పిటాలిటీ అవార్డు

22 Aug, 2018 14:42 IST|Sakshi
అవార్డు, ప్రశంసా పత్రంతో లక్నవరం ఇన్‌చార్జి రాజ్‌కుమార్, బోట్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌  

రానున్న ఐదేళ్లలో 100 కాటేజీలకు కేంద్రం సుముఖత

లక్నవరం యూనిట్‌  మేనేజర్‌ రాజ్‌కుమార్‌

గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సు వద్ద ఉన్న కాటేజీలకు ఇండియన్‌ హాస్పిటాలిటీ అవార్డు లభించినట్లు లక్నవరం యూనిట్‌ మేనేజర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు తేజావత్‌ రామచంద్రుడు, వేణుగోపాలచారిలు లక్నవరం అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న 9 ఐలాండ్‌లలో 100 కాటేజీల నిర్మాణం కోసం ప్రధానికి ప్రతిపాదన అందజేసినట్లు ఆయన చెప్పారు.

దీంతో కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. లక్నవరం సరస్సు అభివృద్ధి కోసం గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో పాటు టీఎస్‌టీడీసీ చైర్మన్‌ బోయినపల్లి మనోహర్‌రావులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరు చేయిస్తున్నారన్నారు. ఇక్కడి రిసార్ట్స్‌కు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో కూడా హరిత హోటల్, కాటేజీలలో ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట లక్నవరం బోట్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్, రణధీర్‌లు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు