సమాచార శాఖ కమిషనర్‌గా బీపీ ఆచార్య

16 Apr, 2015 00:49 IST|Sakshi

హైదరాబాద్ సిటీ: సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్‌గా బీపీ ఆచార్య బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన ప్రణాళిక, పర్యాటక శాఖల ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రదీప్ చంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

ఆయన ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వున్నారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి నుంచి ప్రభుత్వం ఆయన్ను ఆర్థిక శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు