వరంగల్లో 'ఇన్‌స్పైర్' కార్యక్రమం

21 Jan, 2015 11:23 IST|Sakshi

వరంగల్: వరంగల్ నగరం తూర్పు నియోజకవర్గంలో జిల్లా ప్రైవేటు పాఠశాలల  అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పదో తరగతి విద్యార్థుల కోసం ఇన్‌స్పైర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.  ఇన్‌స్పైర్ కార్యక్రమంలో డీఈవో చంద్రమోహన్, అసోసియేషన్ నేత వెంకటేశ్వర్లు, రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు