ఇంటర్ పరీక్ష ఫీజు గడువు 3 వరకు పెంపు

29 Oct, 2014 01:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  తెలంగాణ, ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును నవంబరు 3వ తేదీకి ఇంటర్ బోర్డు పొడిగించింది.  ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించగా, ఇపుడు మూడోసారి కూడా పెంచింది. రూ. 100 ఆలస్య రుసుముతో వచ్చే నెల 15వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. 2015 మార్చిలో జరిగే పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులందరికీ (జనరల్, వొకేషనల్, ప్రైవేటు) ఈ మార్పు వర్తిస్తుందని బోర్డు వెల్లడించింది.

మరిన్ని వార్తలు