ఆన్‌లైన్‌ ఫిర్యాదుల విధానం

7 Jan, 2020 03:22 IST|Sakshi

ఇంటర్‌ విద్యార్థుల కోసం... నేడు ప్రారంభించనున్న సీఎస్‌ సోమేశ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల్లో సమస్యలు వచ్చినా, ఫలితాలకు సంబంధించి ఏమైనా పొరపాట్లు దొర్లినా, విద్యార్థులకు ఎదురయ్యే ఏ ఇతర సమస్యలకు సంబంధించి అయినా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు చర్యలు చేపట్టింది. గత పరీక్షల సమయంలో దొర్లిన తప్పులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టమ్‌ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో చేసే ఫిర్యాదును నిర్ణీత సమయంలో పరిష్కరించేలా, సంబంధిత సమాచారాన్ని సదరు విద్యార్థి మొబైల్‌ నంబరు/ఈమెయిల్‌ ఐడీకి పంపేలా ఏర్పాటు చేస్తోంది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల ద్వారా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు. ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మంగళవారం దీనిని ప్రారంభిస్తారని తెలిపారు.

>
మరిన్ని వార్తలు