రాజ్‌ భవన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

4 Mar, 2020 20:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం రాజ్‌భవన్‌లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రరెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత హాజరయ్యారు. అలాగే ఏపీ నుంచి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాతోపాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు హాజరయ్యారు. ముందుగా గవర్నర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. (‘సోషల్‌ మీడియా సన్యాసం’పై మోదీ మరో ట్వీట్‌)

గవర్నర్‌తో సెల్ఫీ

మరిన్ని వార్తలు