పైసా చార్జీ లేదు, టీ వ్యాలెట్‌ ప్రత్యేకతలివే!

1 Jun, 2017 16:06 IST|Sakshi
పైసా చార్జీ లేదు, టీ వ్యాలెట్‌ ప్రత్యేకతలివే!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘టీ-వ్యాలెట్‌’ను ఐటీ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. తాజ్‌ డెక్కన్‌లో గురువారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ డిజిటల్‌ వ్యాలెట్‌ను ప్రారంభించారు. నగదు రహిత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈ వ్యాలెట్‌ ద్వారా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు చెల్లింపులు జరుపుకోవచ్చు. ఫోన్‌ లేకున్నా మీ సేవ సెంటర్ల సహాయంతో టీ-వ్యాలెట్‌ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం ఉంది.

ఈ వ్యాలెట్‌ ప్రత్యేకతలు ఇవే..

  • ఆధార్ ప్లస్ బయో మెట్రిక్, ఆధార్ ప్లస్ మొబైల్ OTP ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.
  • ఆసరా, ఉపాధి హామీ పథకాల ద్వారా వచ్చే నగదును నేరుగా యాప్ ద్వారా పొందొచ్చు.
  • తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో టీ వ్యాలెట్‌ యాప్ రూపొందింది.
  • స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండానే యాప్ ఉపయోగించుకోవచ్చు.
  • మీ సేవ ద్వారా వ్యాలెట్ లో డబ్బు వేసుకోవచ్చు.
  • యాప్ ద్వారా జరిపే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉచితం
  • T వ్యాలెట్ అన్ని ప్రభుత్వ చెల్లింపులను చేసుకోవచ్చు. కరెంట్, వాటర్, జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను, డీటీహెచ్, ల్యాండ్ లైన్, మొబైల్ రీఛార్జి, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించుకోవచ్చు.
  • ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఫీజులు కూడా చెల్లించుకోవచ్చు.
  • నగదును ఎలాంటి ఛార్జీ లేకుండా ఇతరులకు పంపించుకోవచ్చు.
     

మరిన్ని వార్తలు