ఖమ్మం ఎంపీ ఇంటిపై ఐటీ దాడులు

18 Sep, 2018 15:56 IST|Sakshi
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ఖమ్మం: ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటితో పాటు, ఆయన కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన మొత్తం 18 చోట్ల ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఖమ్మం, హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని ఎంపీ నివాసం వద్ద కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు దాడుల చేశారని తెలిసింది. హైదరాబాద్‌, కొత్త గూడెంలలోని ఎంపీ అనుచర కాంట్రాక్టర్లు, సబ్‌ కాంట్రాక్టర్లపై కూడా రేపు(బుధవారం) ఐటీ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే అధికారులు ఏమైనా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారా? అనే విషయం తెలియాల్సివుంది. దీనిపై పొంగులేటి స్పందిస్తూ తన ఇంటిపై జరిగినవి ఐటీ దాడులు కావని, ప్రతీ ఐదేళ్లకోకసారి జరిగే సాధారణ ప్రక్రియ అని కొట్టి పారేశారు.

మరిన్ని వార్తలు