మైహోం రామేశ్వరరావు ఇంటిపై ఐటీ దాడులు

5 Jul, 2019 07:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్త, మైహోం గ్రూప్స్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని రామేశ్వరరావు ఇల్లు, హైటెక్‌ సిటీలోని ఆయన కార్యాలయంలో ఈ తనిఖీలు జరిగాయి. బెంగళూరులో ఓ సంస్థకు, మైహోం గ్రూప్స్‌నకు మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల విషయంలో స్పష్టత కోసం ఈ దాడులు జరిగినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు