తమిళనాడు తాటిబెల్లం

16 Sep, 2019 11:45 IST|Sakshi

సంగారెడ్డి పట్టణ శివారులో తాటిబెల్లం అమ్ముతున్న వ్యక్తి  

సంగారెడ్డి మున్సిపాలిటీ: బతుకుదెరువు కోసం తమిళనాడు రాష్ట్రం నుంచి తాటి గుంజల నుంచి తయారు చేసిన బెల్లాన్ని జిల్లా కేంద్రం సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఈ బెల్లం రుచిగా ఉండటంతో పట్టణ ప్రజలు, వాహనదారులు కొనుగోలు చేస్తూ తింటున్నారు. తమిళనాడు నుంచి వాహనంలో తీసుకువచ్చిన విక్రయదారులు పట్టణ శివారులో అక్కడక్కడా ప్రధాన కూడళ్ల వద్ద ఈ తాటి బెల్లం విక్రయిస్తున్నారు. ఈ బెల్లంతో ఎలాంటి హానీ జరగదని, ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు