జనగామలో బంద్ : దుకాణాలు మూసివేత

5 May, 2015 11:37 IST|Sakshi

వరంగల్ : వరంగల్ జిల్లా జనగామలో వ్యాపార వర్గాలు మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. పట్టణంలోని ఓ వ్యాపారిని మీడియా ప్రతినిధి వేధించాడు. దీంతో సదరు వ్యాపారి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నేపథ్యంలో వ్యాపారులు మంగళవారం బంద్కు పిలుపునిచ్చారు. దీంతో జనగామ పట్టణంలోని వ్యాపార దుకాణాలు అన్ని మూసివేశారు. మీడియా ప్రతినిధిపై చర్యలు తీసుకోవాలంటూ వ్యాపార వర్గాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని వ్యాపారులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు