ఎన్నికలు సమీపిస్తుంటే ఉద్యోగ నోటిఫికేషన్లా..?

18 Mar, 2018 02:33 IST|Sakshi

కాంగ్రెస్‌ సేవాదళ్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతుంటే వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తూ ఓట్ల రాజకీయం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ సేవాదళ్‌ చైర్మన్‌ కనుకుల జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో 1.68 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా యని ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారని, అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ కూడా 1.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినా నాలుగోవంతు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు.

మరిన్ని వార్తలు