హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను సినీనటి జయప్రద శనివారం సచివాలయంలో కలిశారు. ఆమె తన సోదరి కుమార్తె వివాహ పత్రికను కేసీఆర్కు అందచేశారు. వివాహానికి రావాలని జయప్రద ఈ సందర్భంగా కేసీఆర్ను ఆహ్వానించారు. అనంతరం జయప్రద మాట్లాడుతూ తన సోదరి కుమార్తె పెళ్లికి ఆహ్వానించేందుకే కేసీఆర్ను కలిసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.