దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: జూపల్లి

26 Apr, 2016 04:19 IST|Sakshi
దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: జూపల్లి

కొల్లాపూర్: పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చే సేందుకు కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జూపల్లికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను సీఎం కేటాయించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన సోమవారం రాత్రి కొల్లాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు.

తనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కే సీఆర్‌కు కృత జ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తరహాలో పంచాయతీరాజ్ వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.

>
మరిన్ని వార్తలు