'ఎర్రబెల్లి టీఆర్ఎస్లో రాకుండా అడ్డుకుంది నేనే'

29 May, 2015 13:02 IST|Sakshi

హైదరాబాద్ : టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్లోకి రాకుండా అడ్డుకున్నది తానేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎర్రబెల్లి టీఆర్ఎస్లో చేరాలనుకున్న మాట వాస్తవమే అన్నారు. ఎర్రబెల్లిలాంటి తెలంగాణ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో ఎప్పటికీ స్థానం ఉండదని కడియం అన్నారు. టీఆర్ఎస్ ను విమర్శించే అర్హత ఎర్రబెల్లికి లేదన్నారు.

 

మరిన్ని వార్తలు