కేయూలో స్పాట్ వాల్యుయేషన్ రేపటి నుంచే..

26 Apr, 2015 10:38 IST|Sakshi

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 27వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణాధికారి బి.వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి  ఇంగ్లిష్, జువాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, తెలుగు పత్రాలు... మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాథ్స్, కెమిస్ట్రీ, కామర్స్ పత్రాల వాల్యుయేషన్ జరుగుతుందని చెప్పారు. పరీక్షల విభాగంలో ఓ అధికారికి, కాంట్రాక్టు లెక్చరర్‌కు మధ్య ఏప్రిల్ 18న వివాదం జరగడంతో స్పాట్ వాల్యుయేషన్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు