కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ భేటీ

26 Nov, 2019 01:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వికారాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఊటీ గోల్ఫ్‌ కౌంటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కపిల్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కేటీఆర్‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 18 హోల్‌ చాంపియన్‌షిప్‌ గోల్ఫ్‌ మైదానం, రిసార్టులు, గృహాల నిర్మాణం పనులు వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తవుతాయని కపిల్‌ వివరించారు. ఊటీ గోల్ఫ్‌ కౌంటీ ఆధ్వర్యంలో తూప్రాన్‌ సమీపంలోని మాసాయిపేటలోనూ హల్ది పేరిట కొత్త గోల్ఫ్‌ మైదానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. భేటీలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియొద్దీన్, ఊటీ గోల్ఫ్‌ కౌంటీ సీఈఓ కె.రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు