పెళ్లిళ్లతో ఆగిపోయిన జెడ్పీ సమావేశం

25 Nov, 2017 15:51 IST|Sakshi

సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా జెడ్పీ సమావేశానికి పెళ్లిళ్లు దెబ్బకొట్టాయి. జడ్పీ సభ్యులు పెళ్లిళ్లకు వెళ్లటంతో శనివారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఆగిపోయింది. కోరంలో సరిపడా సంఖ్యలో సభ్యులు హాజరుకాకపోవటంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ ప్రకటించారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతోనే సభ్యుల్లో చాలమంది సమావేశానికి హాజరు కాలేదని, త్వరలోనే సమావేశం తేదీని ప్రకటిస్తామని ఆమె ప్రకటించారు.

మరిన్ని వార్తలు