కత్తి మహేశ్‌ దిష్టిబొమ్మ దహనం

11 Jul, 2018 12:08 IST|Sakshi
దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు

మల్యాల/రామడుగు: రాముడిపై అనుచిత వ్యా ఖ్యాలుచేసిన కత్తి మహేశ్‌ దిష్టిబొమ్మను విశ్వహిం దూపరిషత్, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో మంగళవా రం మల్యాల మండలంలో దిష్టిబొమ్మను దహనంచేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. భజరంగ్‌దళ్‌ జిల్లా కోకన్వీనర్‌ బొద్దుల మ హేందర్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కట్ట రవీందర్‌ మాట్లాడుతూ.. పరిపూర్ణానంద స్వామిని గృ హనిర్భందం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ రా జారంకు వినతిపత్రం అందించారు. కార్యక్రమం లో భజరంగ్‌ దళ్‌ జిల్లా కోకన్వీనర్‌ బొద్దుల మ హేందర్‌తోపాటు బట్టు నరేశ్, గణేశ్, నరేశ్, చొప్ప దండి నియోజక వర్గ బీజేపీ కన్వీనర్‌ జిన్నాం విద్యాసాగర్, నాయకులు జిట్టవేని అంజిబాబు, బండపల్లి శ్రీధర్, రమేశ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు