సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ఆసియాకప్ సాధించడం పట్ల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత జట్టు విజేతగా నిలవడం అరుదైన విజయమని అభివర్ణించారు. భారత జట్టు ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.