' సింగపూర్, మాదాపూర్ ల వెంటబడొద్దు'

1 Oct, 2014 18:41 IST|Sakshi
' సింగపూర్, మాదాపూర్ ల వెంటబడొద్దు'

హైదరాబాద్: అభివృద్ధి పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... సింగపూర్, మాదాపూర్ ల వెంటబడడం సరికాదని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. పేదల అభ్యున్నతి, సమగ్ర సామాజిక అభివృద్ధితో సమాజంలో అంతరాలను తగ్గించడంపై కేసీఆర్ దృష్టి సారించాలని ఆమె సూచించారు.

తెలంగాణ సచివాలయంలో బుధవారం జరిగిన బతుకమ్మ పురస్కారాల ప్రదానోత్సంలో ఆమె పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు